నేటి నుండి కంఠమహేశ్వర స్వామి బోనాల ఉత్సవాలు.

మర్రిగూడ- ప్రభాత సూర్య:గౌడ కులస్తులు తమ ఆరాధ్య దైవంగా పూజలందుకునే సురమాంబ సమేత కంఠ మహేశ్వర స్వామికి గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల మహోత్సవం నేటి నుండి మూడు రోజుల పాటు కన్నుల పండుగ జరుపుకోనున్నారు. శనివారం
ఉ॥గం॥ 07-30ని॥లకు గణపతిపూజ, పూణ్యవచనము మండప పూజ కలశ పూజ, మూలవిగ్రహములకు రుద్రాభిషేకము. నవగ్రహలంకరణ పూర్ణాహుతి హోమము, పంచసుక్త హోమము, రుద్ర హోమము, శిఖర కలశ, ప్రతిష్ఠ పూర్ణాహుతి మరియు తీర్థప్రసాదముల వితరన..
మధ్యాహ్నం1.00గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం,
సోమవారంస్వామి వారికి పంచామృత అభిషేకము అలంకరణ, అర్చన ఉ॥ 8.00 గంటలకు బోనాల శోభ యాత్ర మ॥ 12.00గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గౌడ పెద్దలు తెలిపారు. ఉత్సవాలకు
స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద బిక్షం గౌడ్, బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు క్యామ మల్లేష్,తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్
మాజీ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్,
తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజుగౌడ్ లు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
About The Author
