Etala Rajender:కాళేశ్వరం పై ఈటల పొగడ్తల వర్షం

On
Etala Rajender:కాళేశ్వరం పై ఈటల  పొగడ్తల వర్షం
కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడిన ఈటల రాజేందర్

కాళేశ్వరంపై బీజేపీ డబుల్ స్టాండ్
ఈటల రాజేందర్ ఒకలా , కిషన్ రెడ్డి మరోలా వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడిన ఈటల రాజేందర్
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కిషన్ రెడ్డి ఆరోపణ
సీబీఐ ఎంక్వైరీ కోరుతున్న బీజేపీ నేతలు

ప్రభాత సూర్య-తెలంగాణడెస్క్:

తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం లోపించిందా? లేదా...ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? ఈటల రాజేందర్ పార్టీ లైన్ కి వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నారా? కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వ్యాఖ్యల మధ్య ఆ లోపం ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఈటల రాజేందర్ ప్రేమను ఎందుకు బహిరంగ పరిచారు. కిషన్ రెడ్డి, ఇతర నేతలు ఒకటి మాట్లాడితే.. ఈటల రాజేందర్ కాళేశ్వరం మరోటి మాట్లాడుతున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. ఇందులో ఇప్పటి అధికారులను, రాజకీయ నేతలను విచారించింది. ఐతే ప్రముఖంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ విచారణ సంచలనంగా మారింది. ఐతే.. ఈటల తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో.. కాళేశ్వరం పై పొగడ్తల వర్షం కురిపించారు

ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. బీజేపీ నుంచి ఒక సారి ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఐతే కాళేశ్వరం ప్రాజెక్టును  బీజేపీ విమర్శిస్తోంది. పార్టీ అగ్ర నేతలు సైతం ఆ ప్రాజెక్టు ఏటింలా బీఆర్ఎస్ ఉపయోగించుకొందని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా సైతం అనేక సార్లు విమర్శలు గుప్పించారు. అంతేకాదు లక్ష్మణ్, కిషన్ రెడ్డి వంటి నేతలు ఏకంగా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పాజెక్టుపై బీజేపీ స్టాండ్ క్లియర్ గా కనిపిస్తోంది. ఐతే ఆ పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణ తర్వాత పార్టీ లైన్ కి భిన్నంగా మాట్లాడారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి ఎంతో లాభం జరిగిందని చెప్పుకొచ్చారు. కాళేశ్వరంతో తెలంగాణ సశ్యశ్యామలం అయ్యిందన్నారు.  ఓ వైపు బీజేపీ ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టమే తప్ప లాభం లేదంటుంటే...ఈటల రాజేందర్ విరుద్దంగా మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. 

Read More Local body elections:వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు

ఇదిలా ఉంటే ఈటల వ్యాఖ్యలు చేసిన మరునాడే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాళేశ్వరంపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంతో రాష్ట్రానికి నష్టమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు. ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ లేదని బీజేపీ గతంలోనే చెప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణపై మొహం మార్చిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

ఐతే కిషన్ రెడ్డి ఇలా మాట్లాడితే...ఈటల రాజేందర్ ప్రాజెక్టుపై పొగడ్తల వర్షం కురిపించడం ఏంటని...ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్...ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలు నష్టం కలిగిస్తాయని ఆయన అనుచరులు భావిస్తున్నారట. ఇదిలా ఉంటే సొంత పార్టీ లైన్ కి వ్యతిరేకంగా ఈటల రాజేందర్ మాట్లాడటంపై నేతలు, కార్యకర్తలు అసహనంగా ఉన్నారట. బీఆర్ఎస్ కు అనుకూలంగా ఈటల మాట్లాడుతున్నారని...మళ్లీ ఆయన ఆ గడప తొక్కేలా ఉన్నారని చర్చించుకుంటున్నారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈటల రాజేందర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో తప్పు లేదు...కానీ పార్టీ కొన్నిటిపై తీసుకున్న స్టాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదంటున్నారు బీజేపీ శ్రేణులు. ఇది ఇలానే సాగితే పార్టీకి తీవ్ర నష్టం అని భావిస్తున్నారట.

Views: 2

About The Author

Latest News