ప్రైవేటు స్కూళ్లా... " వ్యాపార కేంద్రాలా?
తోక పేర్లతో మాయాజాలం

పుస్తకాలు, యూనిఫామ్ల పేరిట దోపిడీ షురూ
* విద్యా వ్యాపారంలో ప్రైవేటు స్కూళ్ల పెడధోరణులు
" అడ్డగోలుగా ఫీజుల వసూలు
" పాఠశాలలోనే యూనిఫామ్లు, పుస్తకాల విక్రయం
విద్యా హక్కు చట్టానికి తూట్లు
" లబోదిబోమంటున్న తల్లిదండ్రులు
ఉదాసీ వైఖరిలో విద్యాశాఖాధికారులు
తుర్కయంజాల్-ప్రభాత సూర్య:విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. చదువుకునే రోజులు పోయి.. చదువుకొనే రోజులు వచ్చాయి. విద్యాసంస్థలు వ్యాపార దుకాణాలుగా మారిపోయాయి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు పేదవాడి శ్రమ దోపిడీగా మారింది. ఒక పక్క ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందిస్తుంటే.. ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం రూ.5 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. వీటికి తోడు టై, బెల్ట్, షూ, యూనిఫాం అదనం! యూనిఫాంలు, పుస్తకాలు, ఇతర స్టేషనరీలను వారి నుండి మాత్రమే కొనుగోలు చేయడం తప్పనిసరి అని పాఠశాలలు పట్టుబడుతున్నా యని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు పడుతున్న తపనను ప్రైవేట్ స్కూల్స్ లాభ సాటిగా మార్చుకున్నాయి. వేలకు వేలు ఫీజులు గుంజుతూ.. మరో వైపు పుస్తకాల వ్యాపారం కూడా చేస్తూ.. అందిన కాడికి దోచుకుంటున్నా. విద్యాశాఖ మాత్రం కళ్ళు మూసుకొని కాలం వెళ్లదీస్తోంది. వి ద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో, ప్రైవేట్ పాఠ శాలల్లో చదువుతున్న పిల్లల తల్లితండ్రులు పెరుగుతు న్న విద్యా ఖర్చులను తట్టుకోలేక పోతున్నారు. పాఠ శాలకు ప్రజాదరణ ఎంత ఎక్కువగా ఉంటే, ఖర్చుకూ డా అంత ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు పుస్తకాలకే రూ.5,000 నుండి రూ. 15,000 వరకు వసూలు చేస్తున్నారు. అవే పుస్తకాలు మార్కెట్ నుండి కొనుగోలు చేస్తే, ఈ పాఠశాల యాజమాన్యాలు వసూలు చేసే మొత్తంలో సగం కంటే తక్కువ ధరకే వా టిని పొందవచ్చు. కానీ, పాఠశాలలు యూనిఫాంలు, పుస్తకాలు, ఇతర స్టేషనరీలను వారి నుండి మాత్రమే కొ నుగోలు చేయడం తప్పనిసరి! ఫలితంగా ప్రైవేట్ స్కూ ల్స్ వ్యాపార కేంద్రాలుగా మారిపోవడంతో తల్లిదండ్రు లు అధిక మొత్తాలను చెల్లించాల్సివస్తుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో, ప్రైవేట్ పాఠశా లల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు పెరిగిన విద్యా ఖర్చులతో తట్టుకోలేకపోతున్నారు. పాఠశాలకు సర ఫరా చేసే పుస్తకాలు, యూనిఫాంలు, స్టేషనరీ, ఇతర సా మగ్రి ధరలను నిర్ణయించడానికి నిర్దిష్ట నిబంధనలు వి ధించాలని ఆందోళన చెందుతున్న తల్లితండ్రులు పట్టు బడుతున్నారు. కానీ, పాఠశాల యాజమాన్యం తమపి ల్లలను లక్ష్యంగా చేసుకుంటుందనే భయంతో ఏ తల్లి దండ్రులు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉండ రు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి నిర్దిష్ట నియమంలే దని విద్యా శాఖ అధికారులు అంగీకరించడం గమనా ర్హం. అనుమతులు, గుర్తింపులు ఇచ్చేసమయంలో, పా ఠశాల యాజమాన్యాలు నియమాల పుస్తకాన్ని ఖచ్చి తంగా పాటించాలని ఆదేశించడం కాగితాలకే పరిమి తం అవుతున్నాయి. ఏదైనా నిర్దిష్ట ఫిర్యాదుఉంటే తప్పు, తప్పు చేసిన పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవడా నికి విద్యాశాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.
తమ పిల్లల భవిష్యత్తు కోసం..
తల్లిదండ్రుల నుంచి పాఠశాలల యాజమాన్యా లు వేలకు వేలు ఫీజుల భారం మోపుతున్నాయి. అడ్మి షన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, కంప్యూటర్ ల్యాబ్, ట్యూషన్, స్పోర్ట్స్, స్పెషల్ డేస్, కమ్యూనికేషన్ ప్రోగ్రాం ఫీజు లంటూ ఇప్పటికే వేలాది రూపాయలు వసూలు చేస్తు న్న యాజమాన్యాలు.. మళ్లీ పుస్తకాలు, నోటు పుస్తకా లు, యూనిఫాం, షూ.. అంటూ అందినకాడికి దోచు కుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని పా ఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. దీనికి సంబంధిం చి వారి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంఈవో కార్యా లయం ద్వారా పాఠ్యపుస్తకాలు తెప్పించుకోవాలి. ఆ రేట్లకే విద్యార్థులకు పుస్తకాలను ఇవ్వాలి. నోటు పుస్తకా లు విద్యార్థుల అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు సమ కూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు విక్రయాల్లో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసి వ్యాపారం చేస్తున్నాయి. పుస్తకాల కొను గోలు ధరల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నా విద్యా శాఖ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. నిబం ధలకు విరుద్ధంగా యూనిఫాం,. టై, బెల్టు, బ్యాడ్జీ, షూ.. ఇలా అన్నీ తమ దగ్గరే కొనుగోలు చేసి తీరాల్సిందేనం టూ ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో తప్పక అడిగిన డబ్బులు చెల్లించి షాపుల్లో మాదిరిగా ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వాటిని కొనుగోలు చేస్తున్నారు.
వసతులున్న పాఠశాలెక్కడ!)
జిల్లాలో ఉన్న ప్రయివేటు పాఠశాలల్లో పూర్తి స్థాయి వసతులున్న పాఠశాలలను వేళ్లమీదే లెక్కపె ట్టవచ్చు. మౌలిక వసతుల లేమి, విద్యార్థులకు సరి పడా ఆటస్థలాలు లేవు. తరగతి గదుల కొరత ఉంది. అయినప్పటికీ, అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఇలా అరకొర వసతులతో నిర్వహిస్తు న్నా ఫీజుల వసూళ్లలో మాత్రం పోటీపడి వసూలు చె "స్తున్నారు. ఇది చాలదన్నట్లు పుస్తకాల దోపిడీ అదనం. ప్రభుత్వ ధరల ప్రకారం ఒకటో నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల ధరలు రూ.280 నుంచి 700 వర కు ఉన్నాయి. వీటికి అదనంగా నోటు పుస్తకాలు కొనుగో లు చేయాల్సి ఉంది. నోటు పుస్తకాల ఖర్చు గరిష్టంగా రూ.1500 మించి ఉండదు. అన్నీ కలిపి పదో తరగతికి కూడా రూ.2 వేలతో పుస్తకాల ఖర్చు సరిపోవాల్సి ఉం ది. అయితే ప్రయివేటు బడులు ఇష్టానుసారం పుస్తకాల ధరల మోత మోగిస్తున్నాయి. ఎల్కెజి, యుకెజిలకే రూ.5 వేలకుపైగా వసూలు చేస్తున్నాయి. పెద్దతరగతు లకు రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చే స్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారు లు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. తమ పిల్లల్ని ఎక్కడ వేధిస్తారోననే భయంతో తల్లిదండ్రులూ ప్రశ్నించడం మానేశారు.
తోక పేర్లతో మాయాజాలం..
ఐఐటీ, టెక్నో, ఒలంపియాడ్, ఇంటర్నేషనల్ పాఠశాలల పేరిట మెరుగైన వసతులు ఉన్నాయని కలర్ కరపత్రాలని తయారుచేసి తల్లిదండ్రులను మాయ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులూ పొందకుండానే పాఠశాలలు నిర్వహిస్తూ మౌలిక వసతులు లేకున్నా వేలల్లో డొనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్నారు. సేవా రంగమైన విద్యారంగాన్ని తమ అవసరాలకు వాడు కుంటున్నారు. క్రీడా మైదానాలు, ఫైర్ సెఫ్టీ, బస్సులకు ఫిట్నెస్ వంటివి లేకుండానే విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
About The Author
