CBSE కరికులం పేరుతో సెంట్ జోసెఫ్ స్కూల్ మోసాలు

CBSE కరికులం పేరుతో సెంట్ జోసెఫ్ స్కూల్ మోసాలు
హయత్ నగర్-ప్రభాత సూర్య:స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. విద్యార్థుల అడ్మిషన్ కోసం స్కూళ్లు తల్లిదండ్రుల వెంట పడుతాయి. తల్లి దండ్రులు తమ పిల్లలకు ఉత్తమ విద్య అందించాలని, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న స్కూళ్ళలో.. అడ్మిషన్ కోసం చూస్తారు. ఇదే అదనుగా ఫేక్ స్కూల్స్ ఎక్కువ అయ్యాయి. CBSE వంటి కరికులం ఉందని మోసం చేస్తున్నాయి. ఇదే కోవాలో మోసాలకు దిగిన సెంట్ జోసెఫ్ హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.
హయత్ నగర్ లోని ఈ స్కూల్ కొన్నేళ్లుగా CBSE కరికులం ఉందని.. అడ్మిషన్ తీసుకుంటోంది. తల్లి దండ్రులు ఇది గమనించక... తమ పిల్లలను చేర్పించారు. ఈ స్కూల్ లో ఫిజులం కొనసాగుతోంది. లక్షల్లో ఫీజులు వసూల్ చేస్తున్నారు.
ఐతే ఈ మోసం గమనించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యాశాఖకు ఫిర్యాదు చేసింది. సెంట్ జోసెఫ్ స్కూల్ CBSE కరికులం ఉందని.. ఉత్తమ బోధన చేస్తామని.. అనేక ప్రకటనలు ఇచ్చి తల్లిదండ్రులను మోసం చేసిందని..రంగా రెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారికి TBS రాష్ట్ర అధికార ప్రతినిధి ఫిర్యాదు చేసారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
About The Author
