కేసీఆర్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు అవుతారా? 

On
కేసీఆర్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు అవుతారా? 
ఈటల రాజేందర్ విచారణలో ఏం చెప్పారు? 

ఈటల రాజేందర్ విచారణలో ఏం చెప్పారు? 
హరీష్ రావుపై ఏ ప్రశ్నలు అందించనుంది.? 
ఘోష్ కమిషన్ రిపోర్టులో ఏముంది?

 

ప్రభాత సూర్య -తెలంగాణ డెస్క్ :కాళేశ్వరం విచారణ రంజు మీదుంది. వరుస విచారణలతో..రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అందులోనే.. కేసీఆర్ ను విచారించేందుకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశం. తాజాగా బిఆర్ ఎస్ హయంలో ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను విచారించింది. ఈ నెల 9న హరీష్ రావును ప్రశ్నించనుంది. ఐతే కేసీఆర్ విచారణకు హాజరు అవుతారా? రాష్ట్రంలో ప్రచారం జరుగుతున్నట్టుగానే కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా? కాళేశ్వరం కథ కమీజు చూద్దాం. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ బిఅర్ఎస్ హయంలో కేసీఆర్ పర్యవేక్షణలో నిర్మాణం జరుపుకుంది. కేసీఆర్ హాయంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ  సస్యశ్యామలo అయిందని ఆ పార్టీ నేతలు చెప్తారు. ఐతే బిఅర్ఎస్ అధికారం కోల్పోయే ముందు... రాష్ట్ర ఎన్నికలకు కొన్ని నెలల ముందు.. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోవడం, ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు సంచలనంగా మారాయి. 
కాళేశ్వరం ప్రాజెక్ట్ గతం నుంచి విమర్శల పాలు అవుతూనే ఉంది. నాసిరకం పనులు, అవినీతి ఆరోపణలతో ఎప్పుడు చర్చల్లో ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష కోట్లు ఖర్చు అయిందని.. అందులో అవినీతికి కేసీఆర్ పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. 
ఈ నేపథ్యంలో కేసీఆర్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో విచారణకు ఆదేశించారు. 
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై.. జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్ గా కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 

ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, అధికారులను విచారించింది. ఐతే.. విచారణ పూర్తి చేసి తుది నివేదిక సిద్ధం చేయాల్సింది ఉంది. ఈ క్రమంలో కమిషన్ గడువు పొడిగించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే.. గడువు పెంచిన రెండు రోజులకే కెసిఆర్ కు నోటీసులు ఇచ్చింది. దీంతో రాజకీయంగా పెను సంచలనంగా మారింది. ఐతే.. ఈటల రాజేందర్, హరీష్ రావు హాజరుకు ఎస్ చెప్పగా... కేసీఆర్ నిర్ణయం పై సర్వత్ర ఉత్కంఠ రేపింది. కానీ కేసీఆర్ గడువు కోరడం తో ఈ నెల 11న హాజరు అయ్యేందుకు సరే అన్నారు. 
ఇందులో తాజాగా ఈటల రాజేందర్ విచారణకు హాజరై.... కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు సమాచారమంతా కేసీఆర్, హరీశ్రావు వద్దే ఉందన్నారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పారు. ఆ శాఖకు అన్ని విషయాలూ తెలియవని పేర్కొన్నారు. “కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తన పాత్రేమీ లేదు. ప్రాజెక్టు రీ డిజైనింగ్ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. దీనికి అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రవు ఛైర్మన్ గా ఉన్నారు. నీటి లభ్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారు.

Read More Etala Rajender:కాళేశ్వరం పై ఈటల పొగడ్తల వర్షం

ఆనకట్టల నిర్మాణం సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశం. ఆ నిర్మాణంపై రాజకీయ నాయకులకు ఏం తెలియదు. రూ.63 వేల కోట్లతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. తర్వాత అనేక కారణాలతో ప్రాజెక్టు వ్యయం రూ.82 వేల కోట్లకు పెరిగింది. ఇవాళ కమిషన్ ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నలు అడిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖ ప్రమేయం ఉందా అని అడిగారు. దీనిపై ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినది అని చెప్పాను అన్నారు. 

Read More Local body elections:వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు

తన కణతపై తుపాకీ పెట్టినా సరే.. నిజమే మాట్లాడతా తప్పుఒప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తేలుస్తారనీ అన్నారు. సమాచారం. సాంకేతిక కమిటీ, క్యాబినెట్ కమిటీ సిఫార్సు మేరకు క్యాబినెట్ నిర్ణయం జరిగిందని చెప్పారు. సీడబ్ల్యూసీ, మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు లొకేషనన్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు చెప్పారు. నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డీపీఆర్లో ఉందని చెప్పారు. బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అని ఈటలను కమిషన్ ప్రశ్నించింది.
నిర్మాణ అంశాలన్నీ నీటిపారుదల శాఖ కిందకే వస్తాయని ఈటల బదులిచ్చారు. 

ఈటల విచారణ ఇవాళ ముగియగా..  9న హరీష్ రావు, 11న కేసీఆర్ హాజరు కానున్నారు.

Views: 119

About The Author

Latest News