Education:శ్మశానం పక్కన స్కూల్ రన్
రవీంద్ర భారతి స్కూల్ మూసివేత ....నిబంధనలు పాటించని స్కూల్ పై విద్యా శాఖ చర్యలు

రంగారెడ్డి-ప్రభాత సూర్య;రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో రవీంద్ర భారతి స్కూల్ మూతపడింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు అని విద్యాశాఖ మూసివేసింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో చర్యలు తీసుకుంది.
హయత్ నగర్ లో రవీంద్ర భారతి పేరుతో స్కూల్ నడిచింది. ఐతే.. పాఠశాల భవనం శ్మశానం పక్కనే ఉంది.దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే స్కూల్ బిల్డింగ్ కు noc కూడా లేదు.
నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ నడిపిస్తున్నారు. విద్యా శాఖ అనుమతులు కూడా ఈ పాఠశాలకు లేవు.
రవీంద్ర భారతి స్కూల్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పోరాటం చేసింది. TBS రాష్ట్ర అధికార ప్రతినిధి శివ బహుజన్, రాష్ట్ర ఉపాధ్యాక్షులు ఎర్రి శ్రీ హరిగౌడ్ ఫిర్యాదు చేసారు. దీంతో జిల్లా విద్యా శాఖ అధికారులు స్కూల్ పై చర్యలు తీసుకున్నారు. వెంటనే మూసి వేయాలని నోటీసులు ఇచ్చింది.
About The Author
