prime minister:ఆదంపూర్ ఎయిర్బేస్ సందర్శించిన ప్రధాని
ఇస్లామాబాద్కు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ

భారత్ మాతా కీ జై
ఎయిర్ బేస్ సిబ్బందితో ముచ్చటించిన ప్రధాని మోదీ
సాయిసూర్య-తెలంగాణ డెస్క్:పాకిస్తాన్లో ఉగ్రవాదులు ప్రశాంతంగా తలదాచుకునేందుకు స్థలం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత సైనిక శక్తి పాకిస్థాన్లో ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా..మట్టుబెట్టే సత్తా ఉందని భారత్ నిరూపించిందని అన్నారు. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సందర్శించి...అక్కడి సైనికులతో ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా ఇస్లామాబాద్కు వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అభినందిస్తూ, పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారతదేశం నాశనం చేసిందన్నారు, ఆపరేషన్ సింధూర్ 100 మందికి పైగా ఉగ్రవాదులను నిర్మూలించిందన్నారు.
ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్తాన్ సైన్యాన్ని భారత సాయుధ దళాలు ఓడించాయని అన్నారు. పెహల్గామ్ లో అమాయక పర్యాటకులను హతమార్చడంతో భారత ప్రతిదాడి ఎలా ఉంటుందో ఉగ్రవాదులు వారి దుష్టనాయకత్వానికి ఇప్పటికే అర్థం అయ్యిందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశాన్ని రక్షించడంలో సాయుధ దళాల ధైర్యం, శౌర్యం, వృత్తి నైపుణ్యాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ దేశం ధైర్యం, ఐక్యతను ధృఢం చేసిందన్నారు. సాయుధ దళాల సాహసోపేతమైన విజయం దేశం గర్వించేదిగా ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్ అపూర్వమైనది అని అన్నారు.
భారత వైమానిక దళం పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, కేవలం 20-25 నిమిషాల్లోనే సరిహద్దు లక్ష్యాలను ఛేదించిందని, ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రొఫెషనల్ దళం సాధించిందని ప్రధాని అన్నారు. అంతకు ముందు ప్రధాన మంత్రి ఆదంపూర్ ఎయిర్ బేస్ చేరుకొని సైనికులను ఉత్సాహపరించారు. వారితో ముచ్చటించారు. సైనికులు భారత్ మాతా కీ జై, వందే మాతరం అంటూ నినదించారు.
About The Author
