REVANT REDDY:రేవంత్ వ్యాఖ్యల మర్మమేమిటీ?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇరు నేతల వ్యాఖ్యలు

On
 REVANT REDDY:రేవంత్ వ్యాఖ్యల మర్మమేమిటీ?
ఒకే బాటలో చంద్రబాబు-రేవంత్ 

ఏపీలోనూ ఇదే తరహా పరిస్థితి
అప్పులు తీర్చడానికే ఆదాయం సరిపోవడం లేదా? 
చంద్రబాబు బాటలోనే రేవంత్ రెడ్డి.

సాయి సూర్య- తెలంగాణ డెస్క్‌:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని ఆదర్శంగా తీసుకొని పాలనసాగిస్తున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని పదేపదే చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఎన్నికల్లో హామీలు ఇచ్చి...ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని చెప్పడం వెనుక కారణాలేంటి? సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒకే బాటలో నడుస్తున్నారా? పక్కా వ్యూహాం ప్రకారం జరుగుతున్నదేనా? 

May & Jun copy
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమ్మెకు వెళ్తామంటోంది. టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు దిగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉద్యోగ సంఘాల నుంచి కూడా అంతే స్థాయిలో రియాక్షన్ వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయంటున్నారు.

 

ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగంగా అనేక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు సైతం ఇదే వల్లే వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సంపద ప్రస్తుత పథకాలు, ఖర్చులకు సరిపోవడం లేదు, అప్పులు తీర్చడానికి ఆదాయం లేదని పదే పదే చెప్పడంతో..తమ వల్ల కాదనే చెప్పకనే చెప్తున్నారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Read More Local body elections:వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు

రాష్ట్రంలో అధికారం కోసం ఎన్నికల్లో పార్టీ తరఫున హామీలు ఇవ్వడం సహజం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా హామీలు గుప్పించడం ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తోందనేది వాస్తవం.  ఇది ఒక్క తెలంగాణలోనే కాదు, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇవ్వడం ఆ తర్వాత చేతులెత్తేయడం షరామాములే అయ్యింది. ఈ తరహా తీరుకు చంద్రబాబు పెట్టింది పేరు అని అంటారు. 

Read More Etala Rajender:కాళేశ్వరం పై ఈటల పొగడ్తల వర్షం


ఏపీ సీఎంగా ఉన్న  చంద్రబాబు గతంలోనే ఇలానే హామీలు గుప్పించి..అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని...ఇచ్చిన హామీల అమలు మరిచిపోయారు. తాజా ఏడాది క్రితం అధికారంలోకి వచ్చే ముందు కూడా చంద్రబాబు, టీడీపీ పార్టీ ఇష్టానుసారం హామీలు ఇచ్చింది. సంక్షేమ పథకాల పేరిట నోటికొచ్చినంత ప్రకటించారు. తీరా ఇప్పుడు చూస్తే..అసలు హామీల అమలు దెవుడెరుగు... ఆ ఉసే లేదు అని అక్కడి ప్రజలు అంటున్నారు. 

చంద్రబాబు కూడా ఇదే పద్దతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని..చంద్రబాబుకు ముందే అవగాహన ఉంది. ఏపీ సీఎంగా జగన్ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వాటన్నింటిని పక్కనపెట్టి అధికారం కోసం బాబు హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై చేతులెత్తేశారు. 

ఒకే బాటలో చంద్రబాబు-రేవంత్ 
ఏపీ సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ...రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదు.. పథకాల అమలు కష్టతరం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని నడపడం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని అన్నారు. కేంద్రం సహాకారం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు రేవంత్ అంతకంటే ఒక అడుగు ముందుకేసి కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యింది. తనను కోసినా ఒక్క రూపాయి లేదన్నారు రేవంత్ రెడ్డి. అప్పులు పుట్టడం లేదు, దొంగల్ల చూస్తున్నారు. ఉన్న వాటి అమలుకే ఆదాయం సరిపోవడం లేదనే అచ్చు చంద్రబాబు తరహాలో  మాట్లాడారని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు బాటలో రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. 

మొత్తంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి పక్కా వ్యూహాంతోనే తెలుగు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్నారని చెప్పకనే చెప్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

Views: 102

About The Author

Latest News