రికార్డు సృష్టించిన శుబ్ మన్ గిల్.. ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ గా

On

  • తొలి రోజే రెండు సెంచరీలు 

భారత టెస్టు కెప్టెన్ శుబ్ మన్ గిల్ ఇంగ్లాండ్ గడ్డ పై ఇరగదీస్తున్నాడు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ అద్భుతమైన సెంచరీ తో చెలరేగాడు. ప్రారంభంలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను జైస్వాల్ తో కలిసి గిల్ ఆదుకున్నాడు. ఇక ఆ తరువాత క్రీజులో కుదురుకున్నాక తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేసాడు. సూపర్ ఇన్నింగ్స్ తో భారత్ ను భారీ స్కోర్ దిశగా శుబ్ మన్ గిల్ నడిపిస్తున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి తన బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నాడు. 

Gill  (1)

గిల్ కి ఇది ఏడో టెస్టు సెంచరీ కావడం విశేషం. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్ తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ మెరిసిన శుబ్ మన్ గిల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్ గ వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు చరేసిన నాలుగో భారత కెప్టెన్ గా గిల్ రికార్డులకెక్కాడు. ఇంతకు ముందు విజయ్ హజారే, సునీల్ గవాస్కర్ టెస్టు కెప్టెన్లుగా మొదటి రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లీ వరుసగా మూడు మ్యాచ్ ల్లో సెంచరీలు కొట్టాడు. 

ఇంగ్లాండ్ గడ్డ పై రెండు టెస్టు సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆసియా కెప్టెన్ గా శుబ్ మన్ నిలిచాడు. గిల్ కేవలం 25 సంవత్సరాల 297 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లాండ్ లో అతి తక్కువ వయస్సులో రెండు టెస్టు సెంచరీలు పర్యాటక బ్యాటర్ గా సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా స్టార్ ఈ ఘనతను 22 సంవత్సరాల 180 రోజుల వయస్సులో సాధించాడు. స్మిత్ తరువాత ఈ ఫీట్ సాధించింది శుబ్ మనే కావడం గమనార్హం. 

Views: 13

About The Author

Latest News